సర్వమతసమన్వయ గీతిక
అనాదిగా హైందవ సమాజం విభిన్న సంస్కృతులు, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, సిద్ధాంతాలు, దృక్కోణాలు,దృక్పథాలు,నైతిక విలువల సంగమస్థావరం. హిందుత్వం ఆ సంగమస్థావరం నుండి కార్యోన్ముఖంగా నిశ్చల గంగ ఝరిలా యుగయుగాలుగా తన నిరంతర పయనం కొనసాగిస్తూనే వుంది.
నమ్మకం, విశ్వాసం,సమర్పణభావం,అంకితభావం,భక్తి శ్రద్ధలతో పరమపావని గంగమాత దరి చేరిన వారి మదిని పవిత్రం చేస్తూనేవుంది.
మనం అంతర్గత సంస్కారాల ప్రభావంతో విభిన్న ఆలోచనాధోరణిని కలిగి ఉంటాం. అందుకే మన ఆలోచనలు, ప్రవర్తనలు, వ్యక్తిగతప్రణాళికలు, కర్తవ్య నిర్వహణలలో సారూప్యత కలిగి ఉండకపోవచ్చు.
మనలో కొందరి చిత్తం సహజంగా క్రియాశీలకం. వీరు పని రాక్షసులు. ప్రతిఫలం లేదు అంటే ఎందుకు పనిచేయాలి అనే ధోరణి కూడా కలిగి ఉంటారు. వీరు కుటుంబబాంధవ్యాలతో మమేకమవుతూ రాగద్వేషాలలో పెనవేసుకపోయి మొహభరిత జీవనయానం కొనసాగిస్తుంటారు. వీరు అపరిమిత కోరికలు, వాంఛలతో ధర్మగతిని వదిలి క్రియాశీలక జీవనానికి అలవాటు పడుతారు, నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తారు. ఫలితంగా ఎవరికి ఏమైతే నా కేంటి, నాకు కాసులపంట పండితే చాలు అనే విపరీతధోరణి ప్రదర్శిస్తుంటారు.
ఇలాంటి ఆలోచనల ప్రభావంతోనే వంటనూనెలలో జంతుకొవ్వు, నెయ్యిలో కూరగాయల నూనె,పాలలో 🥛డిటర్జెంట్,యూరియా, ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ 🍦 లలో మల్టోడిస్రీన్ అనే హానికరమైన కెమికల్, పసుపు, జీలకర్రలలో సింథటిక్ కలర్స్, కారం, కుంకుమలలో ఇటుకపొడి, మిరియాలలో బొప్పాయి గింజలు, మనం ఇష్టంగా తినే మామిడి🥭,ఆపిల్🍎,పుచ్చకాయ 🍉లు కూడా కల్తీలుగా, కాదేదీ కల్తీకి అనర్హం అంటూ ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీరు ఇలా మూటలుగట్టి పాపకర్మలు, నీచకర్మలు ఆచరిస్తూనే ఉంటారు.
వీడు ఎంత సంపాదించినా💰తనలోని బాధలను , అమ్మలేడు..తను తాపత్రయపడే సంతోషాన్ని, కొనలేడు..ఆరోగ్యాన్ని, అరువు కూడా తెచ్చుకోలేడు...మనఃశాంతిని ఎప్పటికీ పొందలేడు.అని గ్రహించలేని మందబుద్ధి.
వీరు పుణ్య తీర్థాలలో చేసే నదీస్నానాలు,ఉపవాసాలు, జపాలు, దానాలు,పూజలతో పుణ్యం లభించదు.హృదయంలో పరివర్తనం రానంతవరకు ఎన్నిసాధనలు చేసినను వాటి ప్రయోజనం శూన్యం.
ఇటువంటి అల్పుడు,అజ్ఞానికి ఆధ్యాత్మిక భావనలు అతని కలుషిత హృదయంలోనికి ఏలా చేరుకుంటాయి!! వీటి ఫలితంగా లక్ష్యం 🎯 నందు గల ఆసక్తి లక్ష్యసాధనలో పూర్ణంగా కొరవడుతుంది.
అయితే చేసిన పాపకర్మలకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో అప్రమేయుడికి అంకితభావంతో సమర్పణ చేస్తూ, ప్రతిఫలాపేక్ష రహితంగా నిష్కామకర్మచరణ అనుష్ఠానం ద్వారా వారికి ఆధ్యాత్మిక మార్గంలో పయనం సుగమం అవుతుంది.
కొందరి ప్రవర్తన సహజంగా ఉద్వేగభరితం.వీరు భక్తిమార్గం లోనికి ఆకర్షింపబడి ఆ మార్గం అనుసరిస్తారు.
అయితే వీరిలో కొందరు ఆచారాలు, సంప్రదాయాలను వక్రీకరించి జాతివివక్షణతో సమాజాన్ని కులాలుగా విడదీస్తూ హైందవ సమాజ పురోగతికి అడ్డుగోడలవుతున్నారు!
మరి కొందరు మూఢభక్తి, మూఢనమ్మకాలు,అంధవిశ్వాసాలతో ఇష్ట దేవతారాధనలలో, జాతరలలో జంతుబలులను నైవేద్యంగా సమర్పిస్తూ తమ వాంఛలను, కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు! సర్వం పరబ్రహ్మ చైతన్య స్వరూపం అయినపుడు తమ కోరికలు, వాంఛలను నెరవేర్చుకోవడం కోసం ఇతర ప్రాణులను జంతుబలులుగా సమర్పించడం ఏలా సమర్ధనీయం!? ఇది విశ్వసౌభ్రాతృత్వమును అవహేళన చేయడమే అవుతుంది కదా? ఇటువంటి ధోరణితో ఆత్మపౌమ్యస్థితికి ఎలా చేరుకుంటారు? మీ ఇష్టదైవం ఇలాంటి చర్యలను హర్షిస్తాడా? ఆయన అనుగ్రహం ఆశించడం అంటే అది వాస్తవానికి అపాత్రదానమే అవుతుంది కదా?
దైవదర్శనంలో నూతన పోకడలుగా విశిష్ట దర్శనం,విశేష దర్శనం, శ్రీఘ్ర దర్శనం, నేత్రదర్శనం అని భక్తుల పర్సులను ఖాళీ చేయడం ఎంతవరకు సమర్ధనీయం?
నేటి ప్రభుత్వాలు అగ్నికి ఆజ్యంలా భక్తులు భగవంతునికి సమర్పించే మాన్యాలు, నగలు,హుండీకానుకలను చెరపట్టి స్వామివారి సంపదలను అక్రమంగా అనిర్దేశిత కార్యాలకు తరలిస్తూ భక్తుల మనోభావాలకు తీవ్ర విఘాతం కలిగించడం ఎంతవరకు సమర్ధనీయం?
ఇటువంటి అనైతిక అనాచరణ సాంప్రదాయాల ఆచరణలతో జీవిత విలువలకు తిలోదకాలు ఇస్తూ పతనం అంచులకు చేరుకుంటారు. ఈ ఊసరవెల్లిక్షేత్రాలు బీడుభూములు గాకుండా వ్యవసాయక్షేత్రాలుగా ఏలా అవుతాయి?
ఆధ్యాత్మిక భావనలలో గల ప్రీతి, ఆసక్తి , పవిత్రత, సమర్పణ, అంకిత భావం వీరి ఆచరణలో లుప్తం అవుతుంది . సాధ్యవస్తువు నందు ఉన్న అపారప్రీతి సాధనలో వీరికి రిక్త హస్తాలతో శూన్యంగా మిగిలి పోతుంది.
కారుణ్యమూర్తి, పరమ దయాసాగరుడు అయిన సర్వాంతర్యామిని ఎవరైతే తమలోని అహంకారన్ని సంపూర్ణంగా త్యజిస్తూ ఆత్మతత్వమును అర్ధం చేసుకుని హృదయమును పరిశుద్ధం చేసుకుంటూ దృఢచిత్తం, అంకిత భావం,సమర్పణభావనలతో విశ్వసౌభ్రాతృత్వమును ఆకాంక్షిస్తూ, ఆ సర్వేశ్వరుడి అనుగ్రహంకోసం సదా పరితపిస్తూ వుంటారో వారి యోగక్షేమాలను ఆ అప్రమేయుడు స్వయంగా స్వీకరిస్తారు,వారి ఆధ్యాత్మిక మార్గపయనం సుగమం అవుతుంది. అంతర్యామి అనుగ్రహం, కృపలకు ప్రీతిపాత్రులు అవుతారు.
కొందరి ఆలోచనలు ఉపాసనశీలమైనవి, వారు అంతర్ముఖులుగా ధ్యాననిష్ఠను కలిగి ఉంటారు,
వీరు శుద్ధచైతన్య సాత్వికస్వభావంతో ఇతరులకు హాని కలిగించే ఆలోచనలు మదిలో కూడా తలంచరు. ఇతరుల హితం ఆకాంక్షింస్తూ అందరి యందు సౌభ్రాతృత్వం కలిగివుంటారు. లోక కళ్యాణం ఆశిస్తూ సర్వాంతర్యామిని ఆరాధిస్తుంటారు. అహంకార రహిత కర్తృత్వభావనతో ఆదర్శప్రాయులుగా, మార్గనిర్దేశకులుగా ఆధ్యాత్మిక పురోగతిలో ముందడుగులేస్తుంటారు. అయితే వీరిలో కొందరు తమ ప్రవర్తనలో అహంకారస్వభావులుగా, భోగసామగ్రి యందు మక్కువ కలిగి వాటిని పోగుచేస్తుంటారు.
కొందరు ధీశక్తిమంతులు. శుద్ధ చైతన్య స్వరూపులు, వివేక,విచక్షణభరిత భావనలతో వారు జ్ఞానమార్గంలో పయనిస్తారు. మానవాళికి శుభం,క్షేమం,శ్రేయస్సు కలగాలని అందరి జీవితాలు మంగళకరం కావాలి అనే ఆకాంక్షతో అనుష్ఠానం చేస్తువుంటారు. ఆలయదర్శనం, పూజలు,క్రతువులు, హోమాలు,యజ్ఞాలు నిర్వహించకపోయిన సదా తమ హృదయ క్షేత్రంలో స్థితుడైన భగవంతుని మనోనేత్రంతో వీక్షిస్తూ అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తూ సోమరసపానంతో ఉంటారు. వీరు జీవన్ముక్తులు. ఈ జీవితకాలంలోనే భగవంతుని అనుగ్రహం పొందిన దివ్యాత్ములు.
దృక్పథం,దృష్టికోణం,వివేకం,తత్వదర్శనంలతో ఎందరో మహానుభావులు తత్వజ్ఞానులుగా తమ విశేష మేధ, ప్రజ్ఞ, జ్ఞాన నిధులతో హైందవ సమాజానికి కరదీపికలుగా మార్గదర్శులుగా నిలిచి తమ తాత్వికభావనలతో ప్రవక్తలగా లబ్ధప్రతిష్టలతో స్వయంప్రకాశితులుగా అజరామర కీర్తిని గడించారు.
బ్రహ్మము మాత్రమే సత్యం, ప్రపంచం మిథ్య, జీవుడు బ్రహ్మమే. జ్ఞానం ద్వారా మాయను తొలగించి జీవుడు బ్రహ్మలో లీనం కావడం మోక్షం అని అఖండ భారతం పర్యటిస్తూ జ్ఞానబోధ గావించిన మహనీయుడు, మానవీయుడు అద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ శంకరాచార్యులు. విష్ణుసహస్రనామాలకు వ్యాఖ్యానం వ్రాసి శివకేశవలిరువురూ ఒకటేనని బోధించిన దివ్యజ్ఞాని.
శరణాగతి, అనన్యభక్తి, అనన్య చింతనల ద్వారా పరమాత్మ శ్రీమన్నారాయణుడుని చేరువవ్వడం మోక్షం అని ప్రభోదించిన విశిష్టాద్వైత ప్రవక్త శ్రీ రామానుజాచార్యులు సమతమూర్తిగా విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. ఈ సమతామూర్తి తమ ఆధ్యాత్మిక ప్రవచనాలద్వారా భగవంతుని దృష్టిలో మానవులందరూ సమానమేనని, కుల వివక్ష పనికిరాదని ఎలుగెత్తి చాటారు. నిమ్న జాతుల వారికి ఆలయ ప్రవేశం కల్పించారు. శిథిలావస్థలో ఉన్న అనేక వైష్ణవాలయాలను పునరుద్ధరించారు. ‘ఓం నమో నారాయణాయ' అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశామృతంగా మానవాళికి అందించారు.
జీవుడు (ఆత్మ) వేరు, ఈశ్వరుడు (పరమాత్మ) వేరు. దేవుడు సర్వోత్తముడు, జీవుడు సేవకుడు.సద్భక్తి ద్వారా భగవంతుని సేవించి పరమపదం చేరుకోవచ్చు అని ద్వైత వేదాంతాన్ని ప్రబోధించిన ప్రముఖ హిందూ తాత్వికుడు పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ శ్రీ మధ్వాచార్యులు. శ్రీకృష్ణుడే పురుషోత్తముడు, సర్వోత్తముడని భక్తి మార్గాన్ని, తత్త్వవాదాన్ని దశదిశల వ్యాప్తి చేశారు.
మార్పులేని పరమ సత్యమైన బ్రహ్మం శివుడు. విష్ణువు శివుని యొక్క అత్యున్నత అవతారం, శివుడు విష్ణువు యొక్క అత్యున్నత అవతారం అని శివకేశవులు పరమాత్మ స్వరూపభావనతో తరించిన తత్వవేత్త, శివుడే పరమాత్ముడని, సృష్టికి మూలమని అని ప్రబోధించిన శివ విశిష్టాద్వైత సిద్ధాంతప్రవక్త, సిద్ధాంత శిఖామణి శ్రీకంఠ శివాచార్యులు.
బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అయితే సాధకులు సాధనతో చేరుకునే మార్గాలు విభిన్నం, కానీ వాటి పరమార్ధం ఒక్కటే అని స్వమతసంస్తుతి , స్వమార్గపరిపోషణలకు అతీతంగా సౌభ్రాతృత్వంతో మానవాళి విరియాలి అని సర్వయోగసమన్వితగా గీత ప్రబోధిస్తుంది. హిందుత్వం అనేది ఓ మతప్రతిపాదిక విధానం కాదు అది మానవాళికి జీవనశైలి, జీవనయానం, పరమాత్మకు చేరువచేసే ముక్తిమార్గం.
సర్వేజనా సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
#divineguidance #yogameditation
#yogainspiration #yogamitra