Tuesday, 24 February 2026

ఆధ్యాత్మిక మాలిక 21 ఆనందమే నీ ఆయుష్షు


ఆనందమే నీ ఆయుష్షు 

ఆనందంగా వుండేవాళ్ళు దీర్ఘకాలం జీవిస్తారు.

దీర్ఘకాలం జీవించే వారు మంచి ఆరోగ్యం కలిగివుంటారు.

ఆరోగ్యవంతులుగా వుండేవాళ్లు సంతోషభరిత జీవనవిధానం కలిగివుంటారు.

సంతోషంతో ఉండేవారు  క్రియాశీలక  ఆలోచనలను కలిగివుంటారు.

అవి వారు తీసుకునే ఆహారం, పనులు, ఆలోచనలలో నాణ్యతను కలిగి ఉంటాయి.


ఆరోగ్యవంతులుగా వుండేవారి శరీరంలో ఆమం చాలా తక్కువస్థాయిలో ఉంటుంది.

ఎవరిలో ఆమం ఎక్కువగా తయారవుతుందో వారు అనారోగ్యంతో తరచుగా వ్యాధులభారిన పడుతున్నారు. చరకుడు ‘మందాగ్ని జనితమామం రోగణాం కారణం పరమ్ ‘ అని పురాతన సంస్కృత గ్రంథం ‘చరక సంహితలో 1700 సంవత్సరాల క్రితం పేర్కొన్నారు 

జఠరాగ్ని మందగించడం వల్ల మనం తీసుకున్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కాకుండా పోతుంది. సరిగా జీర్ణం కాని ఆహారం కుళ్ళిపోయి 'ఆమం' అనే జిగట పదార్థంగా మారుతుంది. ఇది శరీరానికి హానికలిగించే విషపదార్థం ‘టాక్సిన్’ రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు కారణమై, వివిధ వ్యాధులకు మూలమవుతుంది

ఈ ఆమం శరీరంలోని వివిధ నాళాలలో పేరుకుపోయి రక్త ప్రసరణకు మరియు పోషకాల సరఫరాకు అడ్డంకిగా మారుతుంది. శరీరంలోని అన్నిఅవయవాల పనితీరులపైన ప్రభావం చూపిస్తుంది. 

ఆకలి లేకపోవడం, ఎప్పుడూ అలసటగా ఉండటం, నిస్సత్తువ, అలసత్వం, కీళ్ల నొప్పులు, మలబద్ధకం, నాలుకపై తెల్లని పొర ఏర్పడటం మరియు నోటి దుర్వాసన వంటివి ఆమంస్థాయిలను గుర్తించగలిగిన ప్రాధమిక లక్షణాలు.

ఆమం వల్ల కీళ్లవాతం, అజీర్ణం మరియు వివిధ రకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.


మన శరీరాలలో ఆమం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోవడానికి మన జీవనశైలీనే ప్రధానకారణం. తీసుకునే ఆహారం విషయంలో మానసిక నియంత్రణ కోల్పోవడం,

కేవలం తినడానికే మనం ఉండేది అని కంటికి ఆకర్షణీయం అనిపిస్తే ఏది పడితే అది తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎప్పడు పడితే అప్పుడు తినడం, ఆకలి వున్నా లేకపోయిన కుంభాలు కుంభాలు లాగించి వేయడం ఓ అలవాటుగా అయిపోయింది. 

ఈ ధోరణి వివాహవిందుల్లో జనాలు ఒకరిని మరొకరు నెట్టుకుంటూ అక్కడి వివిధ రకాల నోరూరించే షడ్రుచులతో కూడిన వంటకాలపై దండయాత్ర అప్రహితంగా కొనసాగించడం తరచుగా చూస్తుంటాం.


విరుద్ధ ఆహారాలు జీర్ణక్రియ దెబ్బతినడానికి,గ్యాస్, అసిడిటీలకు,చర్మ సంబంధిత వ్యాధులు రాషెస్, అలర్జీలకు, రోగనిరోధక శక్తి తగ్గడానికి, శరీరంలో విషతుల్యాలు ఆమం పేరుకుపోవడానికి ప్రధాన కారణమవుతాయి . అందుకే విరుద్ధ ఆహారాలపట్ల అప్రమత్తంగా ఉండాలి అవి:

  • వేసవి కాలంలో అదే పనిగా బాగా వేడి వేడిగా వుండే హాట్ సమోసాలు,మిరపకాయ బజ్జీలు,హాట్ సూప్🍵, మసాలా కాపీ, టీ ☕️ లు తీసుకుంటూవుంటే జీర్ణవ్యవస్థలో అల్సర్లకు కారణమవుతుంది, అవి భవిష్యత్లో క్యాన్సర్ కణాలుగా తయారుకావచ్చు.
  • శీతాకాలంలో చల్లటి ఆహారాలు, శీతల పానీయాలు,ఐస్ క్రీమ్స్, 🍦ప్రిడ్జిలోని పాలు,పెరుగు,మజ్జిగ, నీళ్లు 🛀 మెటబాలిజంను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
  • వేడి వేడిగా ఆహారం తీసుకున్న వెనువెంటనే చల్లటి శీతలపానీయాలు, ఫ్రూట్ సలాడ్లు, మిల్కు షేకులు, 🍧ఐస్ క్రీంలు తీసుకోకండి.
  • భోజనంతో ఐస్ క్రీమ్ 🍦 తీసుకోవడం, ఐస్ క్రీమ్ తో స్వీట్ కలపడం, బాగా ఫ్రై 🍟చేసిన ఆహారాలు రాత్రి 🌙 తీసుకునే పెరుగు పదార్థాలు జీర్ణక్రియను మందగిస్తాయి.
  • పాలలో 🍌అరటిపండు, మామిడిపండు 🥭మినహా పుల్లని పండ్లు నారింజ, నిమ్మ,బత్తాయి కలపకూడదు. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది.
  • తేనెను 🍯ఎప్పుడూ వేడి చేయకూడదు లేదా వేడి పదార్థాలలో కలపకూడదు. వేడి చేసిన తేనె శరీరంలో విషతుల్యంగా మారుతుంది.
  • పాలు 🥛మరియు చేపలను 🍤కలిపి తింటే రక్తప్రసరణలో ఆటంకాలు ఏర్పడి, చర్మ వ్యాధులు, బొల్లి, తెల్ల మచ్చలు వంటివి వచ్చే అవకాశం ఉంది.
  • పెరుగు వంటి చలవ చేసే పదార్థాలను, వేడి చేసే 🍗మాంసాహారంతో కలిపి తీసుకోకూడదు.
  • నెయ్యి మరియు 🍯తేనెను సమాన పరిమాణంలో తీసుకోకూడదు. ఇది శరీరానికి హానికరం.
  • పాలు 🥛తాగే ముందు లేదా తర్వాత వెంటనే ఉప్పగా ఉండే పదార్థాలు తినకూడదు. 

ఆహారం కొందరికి అమృతం, అదే  మరి కొందరికి విషం. అందుకే కొన్ని ఆహారాలు. మతపరంగా, సామాజికపరంగా,ఆరోగ్యపరంగా నిషిద్ధ ఆహారాలుగా పరిగణిస్తారు.

  • మధుమేహం వున్నవాళ్ళు శీతల పానీయాలు,స్వీట్లు, క్యాండీ,పాలీషుచేసిన రైస్, మామిడి, సపోట, అరటి, సీత ఫలం వంటి పండ్లు, బేకరి ఉత్పత్తుల తీసుకోవడం మీద అధిక నియంత్రణ కలిగి ఉండాలి.
  • థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు అయోడిన్ శోషణను ప్రభావితంచేసే సోయా ఉత్పత్తులు, బ్రకోలి,కాలీఫ్లవర్ వంటివి పరిమితం చేయాలి.
  • ఫ్యాటీ లివర్ సమస్య వున్నవాళ్లు చక్కెర, స్వీట్లు, శీతల పానీయాలు ,ఆల్కహాలు,వైట్ బ్రెడ్, మరియు జంక్ ఫుడ్ , బేకరి ఉత్పత్తుల తీసుకోవడం మీద అప్రమత్తత కలిగి ఉండాలి.
  • అలెర్జీలు ఉన్నవారిలో గ్లూటెన్ (గోధుమ), లాక్టోస్ (పాల ఉత్పత్తులు), వేరుశెనగ, నట్స్ వంటివి కొందరికి నిషిద్ధం. 
  • వివిధ మత ఆచారాలలో వారు కొన్ని ఆహారాలను నిషిద్ధ ఆహారాలుగా పరిగణిస్తారు.

మనం తీసుకునే ఆహారంలో సమీకృత పోషకాలు పుష్కలంగా వుండే సాత్విక ఆహారాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. తీసుకునే ఆహారంలో పాలు, పండ్లు, నెయ్యి, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పోషక నిధులైన బాదం, కాజు,పిస్తా, కిస్మిస్,గుమ్మడి,అవిసె గింజలు వంటివి దేహపరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మీ ఆహారంలో ప్రధానంగా ఉండేలా చూసుకోవాలి. 

  • రోజుకు మూడుసార్లు భోజనం చేసే బదులుగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం 🥗 చేయండి.భోజనంలో అన్నం 40% వరకు ఆకుకూరలు, వేపుడులు,సలాడులు, సాంబారు, పెరుగు లేక మజ్జిగ వంటివి 60% వరకు ఉండాలి, మసాలాలు, ఉప్పుకారాలు తక్కువగా వుండేలా చూసుకోవాలి.
  • భోజనం 🍛 తో పొట్టని 70%వరకు మాత్రమే నింపండి, ఈ నాణ్యమైన భోజనశైలి ఆహారం చక్కగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఎసిడిటి,గ్యాస్ లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • భోజనానికి అరగంట ముందుగా, భోజనం తీసుకున్న అరగంట తరువాత మాత్రమే నీళ్లు 🚰త్రాగండి. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే అలవాటు క్రమేణా మానివేయండి.ఈ మార్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
  • సాయంకాల భోజనం 🍛 కు ఉదయం తీసుకునే 🥗అల్పాహారంల మధ్య నిరాహారంగా 13 నుంచి 14 గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి, అయితే మంచినీళ్లు మీ ఆసక్తి మేరకు త్రాగండి. ఈ మార్పు శరీర అంతరశుద్ధికి సహాయపడుతుంది. 

మన ఆరోగ్యం, శరీరపోషణ, దేహదారుఢ్యం, ఆలోచనలు, భావనలు, నడవడికలు ప్రవర్తనలకు తీసుకునే ఆహారం ప్రధానపాత్ర పోషిస్తుంది.

తీసుకునే ఆహారం మితాహారం, హితాహారం,మధురాహారంగా దేహానికి,మనస్సుకు సాత్వికతను చేకూర్చేవిధంగా ఉండాలి. ఏ ఆహారం అయితే మనస్సును ప్రశాంతంగా వుంచడానికి, దేహం ఆరోగ్యవంతంగా వుంచడానికి, మానసిక ప్రకోపాలను దూరంగా వుంచడానికి సహకరిస్తిందో ఆ ఆహారాలు సాత్వికాహారాలు అవుతాయి. అవి జీవితంలో సంతోష మధురిమలకు ఆలంబనగా ఆనంద భరిత జీవితంకు దోహదం చేస్తాయి.  ఆనందంగా జీవించేవాళ్లు దీర్ఘ ఆయుష్షుతో జీవితాన్ని గడిపేస్తారు.

అరగని, తరగని సంపద ఎంతున్నా, ఆరోగ్యసంపదే మిన్న !!!


సర్వేజనా సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️







No comments:

Post a Comment